25-06-2025 01:30:55 AM
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): 2008 కాంట్రాక్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్లకు పెండింగ్ వేతనాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ను విద్యాశాఖ ట్రెజరరీ విభాగానికి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2008 డీఎస్సీలో నష్టపోయిన బాధితులకు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా ఉద్యోగాలిచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా 1,225 మంది అభ్యర్థులు ఫిబ్రవరి 15 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి వేతనాలు చెల్లించలేదు. అయితే ఆర్థిక శాఖ గత నెల 19న దాదాపు రూ.52 కోట్ల బడ్జెట్ను విడుదల చేసినా అవి వారి ఖాతాల్లో జమ కాలేదు. ఉపాధ్యాయ సంఘాలు, 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు వేతనాలకు సంబంధించిన బీఆర్వోను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ జారీ చేశారు.
జిల్లాల్లో ఎంత మంది విధుల్లో చేరారు? ఎప్పటి నుంచి వేతనాలు ఇవ్వాలనే లెక్కలు తీసి వేతనాలు మంజూరు చేయనున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.31 వేలకుపైగా వేతనం రావాల్సి ఉంది. గత అకాడమిక్ ఇయర్ ప్రకారం పనిదినాలకుగానూ వేతనాలు మంజూరు చేయనున్నారు. జూలై 1 వరకు వేతనాలు ఎస్జీటీల ఖాతాల్లో వేతనాలు పడే అవకాశముంది.