23-04-2025 12:00:00 AM
రంగారెడ్డి ఏప్రిల్ 22 (విజయక్రాంతి) సివిల్స్ ఫలితాలలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం చెందిన యువతి మంచి ప్రతిభ కనబరిచింది. మంగళవారం వెల్లడించిన యూపీఎస్సీ ఫలితాలలో పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన రాఘవేంద్ర రావు కుమార్తె ఇంద్రార్చితకు ఆల్ ఇండియా స్థాయిలో 739 ర్యాంకు సాధించింది. గత కొంతకాలంగా యువతీ సివిల్స్ లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగించింది.
ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకు సాధించిన యువతిని వారి తల్లిదండ్రులతో పాటు పట్టణవాసులు హర్షం వెళ్లబుచ్చుతో అభినందనలు తెలిపారు. పట్టుదలతో కష్టపడి చదివి సివిల్స్ సాధించిన యువతని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పలువురు విద్యావేత్తలు కొనియాడారు.