1 March, 2026 | 2:38 PM

ఇంజక్షన్ వికటించి గాంధీలో బాలింత మృతి

01-03-2026 12:00 AM

ఆసుపత్రి వద్ద ఆందోళన

సికింద్రాబాద్, ఫిబ్రవరి28 (విజయక్రాంతి): గాంధీ హాస్పిటల్‌లో బాలింత మృ తి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. బన్సీలాల్పేట మేకల మండికి చెందిన జొన్నల సంజన (26) డెలివరీ కోసం నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో జాయి న్ అయింది. శనివారం ఆమెకు మగ శిశువు జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో నడుం నొప్పి ఉందని సంజన వైద్యులకు చెప్పగా, ఇంజక్షన్ ఇచ్చారని పేర్కొన్నారు.

అయితే ఆ ఇంజక్షన్ వికటించడంతో సంజన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలింత మృతితోకు టుంబ సభ్యు లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎంసిహెచ్ మాతా-శిశు ఆరోగ్య భవనం వద్ద ఆందోళనకు చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యమే సంజన మృతికి కారణమని కుటుంబ సభ్యు లు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.