03-06-2025 12:00:00 AM
గద్దర్ అవార్డ్స్లో తెలంగాణ కళాకారుల కు, సాంకేతిక నిపుణులకు అన్యాయం జరిగిందని టీఎఫ్సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆరోపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ లోని నలుగురు థియేటర్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. “2002 వరకు థియేటర్లలో పర్సంటేజీ విధా నం ఉండేది. సురేశ్బాబు లాంటి కొందరు థియేటర్లలో అద్దె పద్ధతిని మొదలుపెట్టారు.
అల్లు అరవింద్, దిల్ రాజు, ఏషియన్ సునీల్ లాంటి వాళ్లు సురేశ్బాబు బాటలోనే థియేటర్లను తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. దీంతో ఒకప్పుడు తెలంగాణలో 150 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటే ఇప్పుడు వేళ్లమీద లెక్కపెట్టేంత మందే మిగిలారు.
తినుబండారాల ధరలు అధికంగా ఉంటున్నందున సామాన్యులు థియేటర్లకు వెళ్లలేకపోతున్నారు. ఏపీలో థియేటర్స్ వ్యవస్థ ప్రక్షాళనకు పవన్కల్యాణ్ తీసుకుంటున్న చర్యలను అభినం దనీయం. ఆయనకు మా ఛాంబర్ నుంచి పూర్తి సహకారం ఉంటుంది” అన్నారు.
వాళ్లు జ్యూరీ చైర్మన్లు ఏంటి?
“తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల వ్యవ స్థ బాగు కోసం చర్యలు చేపట్టాలి. గద్దర్ అవార్డ్స్ జ్యూరీకి మురళీమోహన్, జయసుధను ఛైర్మన్లుగా పెట్టడం ఏంటో అర్థం కాలేదు. ఇక్కడివారికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎఫ్డీసీ చైర్మన్ అధికారాలను దుర్వినియోగం చేశారు” అన్నారు.
ప్రభుత్వం పునఃసమీక్ష చేసుకోవాలి
టీఎఫ్సీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, హీరో కిరణ్ మాట్లాడుతూ.. “నా సినిమాలకు ప్రైవే ట్ సంస్థల అవార్డ్స్ వచ్చాయి. ప్రభుత్వ అవార్డ్స్లో మమ్మల్ని మర్చిపోయారు. ప్రభుత్వం పునఃసమీక్ష చేసుకోవాలి” అన్నారు. తెలంగాణ డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రమేశ్ నాయుడు మాట్లాడుతూ.. “రాష్ట్రాలు విడిపోయాక కూడా టీఎఫ్సీసీని అధికారికంగా గుర్తించడం లేదు.
ప్రభుత్వం ఇలాంటి వాటిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి” అన్నారు. తెలంగాణ రైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అమృత్గౌడ్ మాట్లాడుతూ.. ‘ఉద్యమం ఉధృ తం కాకముందే ప్రభుత్వం మేలుకోవాలి. లేకపోతే అవార్డు ప్రదానోత్సవాన్ని అడ్డుకుం టాం” అని హెచ్చరించారు.