కలెక్టరేట్లో కార్యాలయాల తనిఖీ
07-05-2026 12:00 AM
మేడ్చల్, మే 6 (విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్లో కార్యాలయాలను కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి తనిఖీ చేశారు. కార్యాలయాల్లో గదులు అన్ని తిరిగి పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి, వాటిని గదిలో భద్రపరచాలని సూచించారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో లా ఆఫీసర్ చంద్రావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.






