calender_icon.png 17 June, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు పదో తరగతి పరీక్ష కేంద్రం తనిఖీ

10-06-2025 08:58:39 PM

ఇల్లెందు (విజయక్రాంతి): పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్ష కేంద్రం, సింగరేణి ఉన్నత పాఠశాల ఇల్లెందును జిల్లా ఫ్లయింగ్ స్కాడ్ సభ్యులు కొత్తగూడెం ఎంఈఓ డాక్టర్ ప్రభుదయాల్(MEO Dr. Prabhu Dayal) మంగళవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి సైన్సు, గణితంలోనే అధిక సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు గమనించనైనది. అందుచేత ఈ సంవత్సరం ప్రారంభం నుండే అన్ని సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని మరీ ముఖ్యంగా ఇంగ్లీషు, గణితం, సైన్సు సబ్జెక్టుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.