10-06-2025 09:01:01 PM
అనంతగిరి: మండల సమైక్య ఆధ్వర్యంలో గ్రామ సంఘం పదాధికారుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రామచంద్ర రావు(MPDO Ramachandra Rao) హాజరై మాట్లాడారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు బ్యాంకు నుండి లోన్లను మంజూరు చేస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలోని మహిళలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి రుణాలను క్లుప్తంగా వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం లక్ష్మి, గ్రామ సంఘం ఓబీలు, సిసిఎస్ లు, ట్రైనింగ్ సీఆర్పీలు పాల్గొన్నారు.