04-06-2025 12:00:00 AM
అశ్వాపురం, జూన్ 3(విజయ క్రాంతి):అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి మహేంద్ర చంద్ర చటర్జీ, అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం మండల కేంద్రంలోని విత్తన దుకాణా ల్లో తనిఖీలు చేశారు. దుకాణదారుల లైసెన్సులు విత్తనాల స్టాకును పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసా య శాఖ ద్వారా అనుమతి పొందిన అధికారిక డీలర్ల వద్ద నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాల న్నారు. ప్రతి దుకాణం ముందు స్టాక్, ధరల బోర్డులు విధిగా ఏర్పాటు చేయాలని, దుకాణాలలో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉం డాలనిసూచించారు.