calender_icon.png 5 June, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

60 డివిజన్లుగా రామగుండం బల్దియా

04-06-2025 12:00:00 AM

  1.  పెరగనున్న విస్తీర్ణం, జనాభా
  2.  మారనున్నకార్పొరేషన్ స్వరూపం
  3.  ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ
  4.  డివిజన్‌లో ఇప్పటినుంచి తిరగాలని పార్టీ క్యాడర్‌కు రామగుండం ఎమ్మెల్యే సంకేతాలు 

పెదపల్లి, జూన్ 3 విజయ క్రాంతి); ప్రస్తుతం 50 డివిజన్లు గా ఉన్న రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్ లతో పునర్విభజన జరుగుతుంది. చుట్టు ప్ర క్కల గ్రామాల విలీనంతో జనాభా, విస్తీర్ణం పెరగనుంది. దీనిలో భాగంగా నూతన ఓట రు జాబితా తయారు చేయడంలో నగర పాలక సంస్థ అధికారులు నిమగ్నమయ్యా రు.

ఇందుకోసం వార్డు ఆఫీసర్లతో కసరత్తును వేగవంతం చేశారు. ఆర్.ఓ ఆంజనే యులు, ఆర్.ఐ. శంకర్ రావు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీహరి, అధికారులు నూతన ఓటరు జాబితా తయారు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. చుట్టు ప్రక్కల గ్రామాల విలీనంతో పెరగనున్న జనాభాను జల్లెడ పట్టి ఒక్కో డివిజన్లో 3వేల నుంచి 3,100 మంది ఓట ర్లు ఉండేలా పునర్విభజన చేస్తున్నారు. నూత న  ఓటరు జాబితాను టౌన్ ప్లానింగ్ అధికారులు మరోసారి పరిశీలించి చివరకు ప్రభు త్వంకు పంపించనున్నారు. ఆపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

కాగా, 1982లో నోటిఫైడ్ ఏరియా నుంచి పురపాలక సం ఘంగా ఉన్న రామగుండం 2014 డిసెంబ ర్లో కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేశారు. ప్ర స్తుతం కార్పొరేషన్ యైటింక్లయిన్ కాలనీ, గో దావరిఖని, ఎన్టీపీసీ, రామగుండం, ఫర్టిలైజర్సిటీ ప్రాంతాలు కలిసి 50 డివిజన్లుగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2,29,644 జనాభా ఉండగా, ప్రస్తు తం 2.80 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. కార్పొరేషన్లో సుమారు 50వేల నివాస గృ హాలు ఉన్నాయి.

అంతర్గాం మండలం లిం గాపూర్, రామగుండం అక్బర్ నగర్, పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గేట్, రామగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి ప్రజల నుంచి విముఖత వ్యక్తమైనా... పునర్విభజన ప్రక్రియను మ రింత వేగవంతం చేశారు. దీంతో 93.87 చ. కి.మీ వైశాల్యంలో ఉన్న రామగుండం కార్పొరేషన్ స్వరూపం మారి 100చ.కి.మీ వరకు పెరగనుంది.

ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ

60 డివిజన్లుగా కొత్త ఓటరు లిస్టు తయా లో అధికారులు తలమునకలు కాగా, ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ మొదలైంది. తమడివిజన్ పరిధిలోకి ఏఏ ప్రాంతాలు వస్తాయోనని ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. డివిజన్లో రిజర్వేషన్లు కూడా మారనున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలకు కొంత గడువు ఇచ్చి ఆ పిద ప గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

ఇదిలా ఉండగా రాబోయే కార్పొరేష న్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుం చి డివిజన్లలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రచారం చేసుకోవాలని, తానే స్వ యంగా సర్వే నిర్వహించి ఎవరైతే గెలుస్తారన్న ధీమా కలుగుతుందో వారికే పార్టీ నుం చి టికెట్లు వస్తాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ పార్టీ క్యాడర్ కు సంకేతాలు పంపినట్లు తెలిసింది.