22 August, 2026 | 2:52 PM

Breaking News

ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణంపై అవగాహన కార్యక్రమం   •   ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   జగన్నాథ ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు   •   అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి   •   డాక్యతాండలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు   •   ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదు   •   జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష   •   వెంకటరామిరెడ్డి విగ్రహం నెలకొల్పాలని ఏకగ్రీవ తీర్మానం   •   మైలారం యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి   •  

మొగిలిపేటలో ఎరువుల దుకాణాల తనిఖీలు

21-04-2026 08:31 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఎరువుల దుకాణాలను జిల్లా డివిజనల్ టాస్క్ ఫోర్స్ బృందం అధికారులు రాజుల నాయుడు, దండ రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈ-పాస్ మిషన్, ఎరువుల నిల్వలు, స్టాక్ రికార్డులు, విక్రయ బిల్లులు తదితర వివరాలను పరిశీలించారు. యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎరువుల విక్రయాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా యూరియాను వ్యవసాయేతర అవసరాలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మల్లాపూర్ వ్యవసాయ అధికారి లావణ్య పాల్గొన్నారు.