05-06-2025 06:21:16 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని చేను గేటు వద్ద రాంజీ గౌడ్ కొమరం భీమ్ విగ్రహాల వద్ద రక్షణ కోసం బుధవారం అధికారులు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో విగ్రహాల చుట్టూ ఖాళీ స్థలం ఉండడంతో మందుబాబులు అక్కడే మద్యం సేవించి ఖాళీ సీసాలను అక్కడే ఉంచడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గిరిజన సంఘ నాయకులు అధికారులకు మొరపెట్టుకోవడంతో అధికారులు కంచెను ఏర్పాటు చేశారు. విగ్రహాల చుట్టూ ఉన్న చెత్తాచెదారం తొలగించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఆనంద్ రావు శంభు భీమ్రావు సూర్య భాను తదితరులు ఉన్నారు.