6 May, 2026 | 7:40 PM

Breaking News

గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •   పంటల మార్పిడి విధానాన్నీ రైతులు అవలంబించాలి   •   కులర్ కరెంట్ షాక్‌తో బాలుడికి గాయాలు   •   పట్వారిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఈవీఎం గోడౌన్ ను పరిశీలన   •  

విద్యార్థుల జీవితాలతో ఆటలా?

26-05-2024 12:05 AM

ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థుల జీవితాలతో ఆటాడుకోవడం భావ్యం కాదు. అసలే, పిల్లలు సున్నిత మనస్కులుగా వుంటారు. అనుకున్న దానికంటే ఒక్క మార్కు తక్కువ వచ్చినా ఎంతో ఫీలై పోయేవారుంటారు. అలాంటిది ఒక విద్యార్థినికి 97 మార్కులకు గాను 77 మార్కులే వేయడం అన్యాయం. ఆ అమ్మాయి మళ్లీ మూల్యాంకనం (రీవెరిఫికేషన్) చేయించడంతో అధికారుల పొరపాటు బయట పడింది. ఈ వార్త ‘విజయక్రాంతి’లో చదివి ఆశ్చర్యపోయాం. ఇక ముందైనా ఇలాంటి తప్పులు జరక్కుండా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు పడాలి. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోగలిగితే బావుంటుంది.

- డి.నిహిరాదేవి, బంజారాహిల్స్