13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

20-01-2026 01:02 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఖానాపూర్, జనవరి ౧9 (విజయక్రాంతి): మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు మహి ళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్టు  ఎమ్మల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం మెప్మా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణా ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఖానాపూర్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)కు రూ.13,22,827వడ్డీ లేని రుణాలు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం పని చేస్తుందని, ఇప్పటికే ఉచిత బస్, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇల్లులు, పెట్రోల్ బంకులు, బస్సులకు ఓనర్లను చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళ శక్తి వివో లు, మహిళ శక్తి లీడర్ లు, పట్టణ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కష్టపడి పని చేసే వారికి అవకాశం.. 

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లిన ప్రతీ కార్యకర్తకు తప్పనిసరిగా రాజకీయ అవకాసం కల్పిస్తామని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే  బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఖానాపూ ర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆశావాదులతో సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్ స్థానాలకు పోటీ ఎక్కువగా ఉందని అందులో ప్రజాబలం ఉన్న వారిని సర్వే ద్వారా గుర్తించి టికెట్లు ఇస్తామని, పార్టీ నేతలు నిరాశ చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.