07-08-2025 12:15:15 AM
వికారాబాద్, ఆగస్టు- 6( విజయ క్రాంతి ) ఆయిల్ పామ్ సాగుకు జిల్లా రైతాంగం ఆస క్తి చూపుతుంది. ఈ పంట సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి లాభాలు ఉండటం తో ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ప్ర భుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తుం ది. భవిష్యత్తు అవసరాలు ఆయిల్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఉద్యానవన శాఖ అధికారులకు లక్ష్యం నిర్దేశించింది.
ఇన్నాళ్లు ఈ పంట సాగుపై రైతులకు అవగాహన లేకపోవడంతో ముందుకు రాలేదు. ప్రస్తుతము ప్రభుత్వ ప్రోత్సహం రాయితీలు కల్పిస్తుండడంతో అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన టార్గెట్ ను ఉద్యానవన శాఖ పూర్తి చేసింది ఇటీవల వికా రాబాద్ మండలం కుత్రే పల్లి శివారులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ అస్మిన్ భాష,డిప్యూటీ డైరెక్టర్ నీరజ ఆయిల్ ఫామ్ మొక్కలు నాటి రైతులకు అవగాహన కల్పించారు.
35 వేల ఎకరాల్లో అనుకూలం....
జిల్లాలో 5. 61 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు అవుతుండగా ఇందులో 50 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు. ఆయిల్ ఫామ్ సాగు ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వము జిల్లాల వారీగా లక్ష్యాలను విధించింది. వికారాబాద్ జిల్లాలో 35, ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు నేల లు అనుకూలంగా ఉన్నాయని, ఉద్యానవన శాఖ గుర్తించింది.
ఈ ఏడాది జిల్లాలో కనీ సం రెండువేల ఎకరాల్లో పంట సాగు చేయాలని లక్ష్యం పెట్టుకోక అది పూర్తయింది. రెం డు వేల మంది రైతులు సాగుకు సుముఖం గా ఉన్నట్టు తెలిసింది. లక్ష్యానికి మించి మరో మూడు వందల ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు.
రాయితీతో.....
ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు రాయితీలు అందిస్తుంది. ఐదు ఎకరాల వరకు సాగు చేసే స న్నా చిన్న కార్ రైతులకు 90% రాయితీపై మొక్కలు అందజేయనుంది. 90% రాయితీ పై డ్రిప్పు పైపులు కూడా అందజేస్తుంది.
పంట దిగుబడి ప్రారంభమయ్యే వరకు అంతర పంటలు సాగుకు ఎకరాకు ఏడాదికి 2100 చెల్లిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ రైతులకు మొక్కలతో పాటు డ్రిప్పు పరికరాలను ఉచితంగా ఇస్తారు తొమ్మిది ఎకరాల నుంచి 12 ఎకరా ల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేసే రైతులకు 80% రాయితీ ఇవ్వనున్నారు.
ఏడాదికి రూ. 2.5 లక్షల ఆదాయం
ఆయిల్ ఫామ్ దీర్ఘకాలిక పంట మూడున్నర సంవత్సరాల నుంచి పంట ప్రారంభ మై ఐదు సంవత్సరాలకు అమ్మకానికి వస్తుం ది. ఇప్పటినుంచి 35 సంవత్సరాల పాటు ఏడాదికి ఎకరాకు పది నుంచి 16 టన్నుల దిగుబడి వస్తుంది. దాదాపు రూపాయలు 2.5 లక్షల ఆదాయం చేకూరుతుంది. ఎకరం పొలంలో 57 మొక్కలు మాత్రమే నాటుకోవాల్సి ఉంటుంది. అంతర పంటలుగా శ్రీగం ధం సర్వే ఉల్లి కూరగాయల పంటలు సాగుచేసుకోవచ్చు.