07-12-2025 01:34:27 AM
-రేపు, ఎల్లుండి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
-తరలిరానున్న దేశ విదేశాల ప్రముఖులు
-27 ప్రత్యేక సెషన్లు.. వివిధ రంగాలపై చర్చలు
-దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ను తలపించేలా ఏర్పాట్లు
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి) : భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సం స్థల ప్రతినిధులు తరలిరానున్నారు. రాష్ర్ట భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి.
ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ సెమీకం డక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్డనైజేషన్, వరల్డ్ బ్యాం క్, ఆషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూనీసెఫ్ ప్రతినిధులతో పాటు టెరీ, బీసీజీ, మైక్రా న్ ఇండి యా, హిటాచీ ఎనర్జీ, ఓ2 పవర్, గ్రీన్కో, అపో లో హాస్పిట ల్స్, ఐఐటీ హై దరాబాద్, నాస్కా మ్, సాఫ్రాన్, డీఆర్డీఓ, స్కైరూట్, ధృవ స్పేస్, అముల్, లారస్ ల్యాబ్స్, జీఎంఆర్, టాటా రియాల్టీ, కోటాక్ బ్యాంకు, గోల్డ్మన్ సాచ్స్, బ్లాక్స్టోన్, డెలాయిట్, క్యాపిటలాండ్, స్విగ్గీ, ఏడబ్ల్యూఎస్, రెడ్ హెల్త్, పీవీఆర్ ఐనాక్స్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్, తాజ్ హోటల్స్, వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
సినీ, క్రీడా ప్రముఖులు
గ్లోబల్ సమ్మిట్ సదస్సులో పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వం టి క్రీడా ప్రముఖులు ‘ఒలంపిక్ గోల్డ్ క్వెస్ట్’ సెషన్లో పాల్గొంటారు. రాజమౌళి, రితేష్ దేశ్ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు ‘క్రియేటివ్ సెంచ్యూరీ పవర్ అండ్ ఎంటర్టైన్మెంట్’ చర్చలో పాల్గొంటారు. ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ర్ట మంత్రులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమ్మిట్ నిర్వహ ణ ఏర్పాట్లతో పాటు సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులను సమన్వ యం చేస్తున్నారు.
దావోస్లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ను తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగాలని సీఎం స్వయంగా ఈ సదస్సు ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నారు. అధికారులతో ఇ ప్పటికే పలుమా ర్లు సమావేశాలు నిర్వహించారు. ఈ సద స్సు వేదికలో రెండో రోజున డిసెంబర్ 9న రాష్ర్ట ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ను ఆవిష్కరిస్తుం ది. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్మ్యాప్ను ఈ డాక్యుమెంట్లో పొందుప రిచా రు. ఈ సదస్సులో అన్ని రంగాల్లో భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబ డులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను పొందుపరిచారు.