17 April, 2026 | 11:42 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వీజేఐఎంలో వాణిజ్య వ్యవహారాలపై అంతర్జాతీయ సదస్సు

29-03-2025 12:52 AM

ముఖ్య అతిథిగా పాల్గొన్న హెచ్‌సీయూ వైస్ ఛాన్సలర్ బీజే రావు

కుత్బుల్లాపూర్, మార్చ్ 28(విజయ క్రాంతి):స్థిరమైన వ్యాపార సరళిలో భవిష్యత్తు వాణిజ్య వ్యవహారాల నిర్వహణ అనే అంశంపై 7వ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ లోని ప్రగతినగర్ వీజేఐఎం కళాశాలలో నిర్వహించడం అభినందనీయమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు తెలిపారు.

గురువారం వీజేఐఎం కళాశాలలో ప్రారంభమైన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బీజే రావు మాట్లాడుతూ ఈ సదస్సులో నిపుణులు అందించే సలహాలు సూచనల వలన విద్యార్ధులకు నెట్ వర్కింగ్ అవకాశాలను తెలుసుకునే అవకాశం ఉందన్నారు.

స్థిరమైన వ్యాపార విధానాల కోసం కృషి చేస్తున్న పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు, విద్యావేత్తలతో విద్యార్ధులు కలుసుకునే అవకాశముందన్నారు. ఈ సదస్సు వలన విద్యార్ధులకు పారిశ్రామిక రంగంలో జరుగుతున్న అనేక విషయాలపై అవగాహన కలుగుతుందని అన్నారు. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు వీజేఐఎం డైరెక్టర్ భరత్ భూషణ్ సింగ్,  డాక్టర్ రవినాథ్, డాక్టర్ వినీత్ ,డాక్టర్ అమర్నాథ్ రెడ్డిలు పాల్గొన్నారు.