25-06-2025 01:57:42 AM
మందమర్రి, జూన్ 24: 2025- విద్యా సంవత్సరానికిగాను సీసీసీ నస్పూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని సింగరేణి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాం సుందర్ కోరారు. కొత్తగూడెం ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారని ఆయన వివరించారు.
కళాశాలలో మొదటి సంవత్సరం సివిల్ కోర్సు లో 60, ఎలక్ట్రికల్ -ఎలక్ట్రానిక్స్- 60, మెకానికల్-60, మైనింగ్-60 చొప్పున మొత్తం 300 సీట్లు ఉన్నాయనీ, వీటిలో 150 సీట్లను సిం గరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగల పిల్లలకు, 150 సీట్లు ఇతరులకు కేటాయించడం జరు గుతుందన్నారు.
సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లలు జులై 3వ తేదీ లోపు సింగరేణి పాలిసెట్ వ్బుసైట్ ద్వారా(https:// scp.scpolytechnic.com/online_admission), ఇతరులు తెలంగాణ పాలిసెట్ వ్బుసైట్ (https://tgpolycet.nic.in) ద్వారా ఈ నెల 24 నుంచి 28 వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9010222161, 8790112515, 9491144168 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.