21-09-2025 12:38:34 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రావాలని విప్ ఆది శ్రీనివాస్ విన్నపం
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): దక్షిణ కాశీ గా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రావాల్సిందిగా శృం గేరి జగద్గు రు శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ మహాస్వామిశృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారిని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈఓ రమాదేవి కోరా రు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో జరుగుతున్న పనుల తీరుతెన్నులు, ప్రగతి వివరాలను స్వామి వారికి వివరించి, స్వామి వారికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఆలయంలో జరుగుతున్న అభివృ ద్ధి విస్తరణ పనుల పురోగతిపై స్వామి వారికి వివరించారు. ఆహ్వానాన్ని మన్నిం చి వచ్చే నెలలో వస్తానని ఆయన తెలిపారు. అనంతరం ఆది శ్రీనివాస్, రాజన్న ఆలయ బృందం శృంగేరిలోని శ్రీ శారద అమ్మవారిని దర్శించుకొని తుంగభద్ర నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట రాజన్న ఆలయ ఈవో రమాదేవి, ఆలయ ఇన్చార్జి స్థానాచారి నమిలి కొండ ఉమేష్ శర్మ, చంద్రగిరి శరత్, శృంగేరి తెలంగాణ రాష్ట్ర బాధ్యులు రాధాకృష్ణ శర్మ ఉన్నారు.