03-06-2025 06:58:32 PM
IPL Final: ఐపీఎల్-2025 ముగింపు వేడుకలు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ విజయం నేపథ్యంలో భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశభక్తి గీతాలకు నృత్య ప్రదర్శనలు అద్భుతంగా ఇస్తున్నారు. ముగింపు వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేనన్(Singer Shankar Mahadevan), ఆయన కుమారులు శివం, సిద్ధార్థ్ మహదేనన్ బృందం దేశభక్తి గీతాలు ఆలపిస్తున్నారు. స్టేడియంలోని ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ వారిలో ఉత్సాహపరుస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించడానికి ముఖ్య అతిథులుగా ఐసీసీ అధ్యక్షుడు జై షా(ICC President Jay Shah), బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ(BCCI President Roger Binny) హాజరయ్యారు. మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య పోరు జరగనుంది.