19-06-2025 11:37:53 AM
ఇజ్రాయెల్-ఇరాన్: ఇజ్రయోల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు పరస్పర దాడులకు దిగాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న సోరోకా మెడికల్ సెంటర్, ఇజ్రాయెల్ దక్షిణాన ఉన్న 1,000 కంటే ఎక్కువ పడకల ప్రధాన ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి ప్రయోగించిందని, ఈ ఆసుపత్రి సుమారు 1 మిలియన్ నివాసితులకు సేవలను అందిస్తుందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ క్షిపణి దాడిలో ఇజ్రయోల్ ప్రధాన ఆసుపత్రితో సహా పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది. ఏఎఫ్పీ ప్రకారం... ఆసుపత్రికి నష్టం వాటిల్లిందని, వివిధ ప్రాంతాలలో విస్తృతమైన నష్టం జరిగిందని ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు.
ప్రస్తుతం తాము గాయాపడిన వారితో సహా నష్టాన్ని అంచనా వేస్తున్నామని వివరించారు. ఈ సమయంలో ఆసుపత్రికి రావద్దని ప్రజలను కోరారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకునేలా ఇజ్రాయోలు ప్రతికర దాడులు చేస్తుందని సహాయక బృందాలు వెల్లడించాయి. ఇజ్రాయోల్ సైన్యం ఇరాన్ అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ పై దాడి చేసిందని, అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ నుంచి రేడియేషన్ వెలువడలేదని ఇరాన్ తెలిపింది. దాడికి ముందే ప్రజలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. క్షిపణి దాడి ఫలితంగా అనేక దాడులు జరిగినట్లు గుర్తించబడ్డాయి - వాటిలో ఒకటి దక్షిణ ఇజ్రాయెల్లోని అతిపెద్ద ఆసుపత్రిని తాకిందని ఐడిఎఫ్ Xలో పోస్ట్ చేసింది.