16-06-2025 02:07:13 AM
దీటుగా బదులిస్తున్న ఇజ్రాయెల్
న్యూఢిల్లీ, జూన్ 15: పశ్చిమాసియా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ఇజ్రాయెల్-ఇరాన్ భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఆపరేషన్ ట్రూ ప్రామిస్-3 పేర భీకర దాడులు చేస్తోన్న ఇరాన్ దూకుడు పెంచగా.. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్ దీటుగా బదులిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇరాన్లో దాదాపు 128 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇజ్రాయెల్లో 13 మంది మరణించారు.
శనివారం పొద్దుపోయిన తర్వాత ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ఈ దాడులను ఏ మాత్రం అడ్డుకోలేకపోయింది. ఇప్పటికే ఇజ్రాయెల్లోని ప్రధాన నగరాలపై మిస్సైళ్లను ప్రయోగించిన ఇరాన్.. ఇజ్రాయెల్ను రక్షించేందుకు ఎవరైనా వస్తే వారి అంతుచూస్తామని హెచ్చరించింది. అయితే ఈ హెచ్చరికలను పెద్దన్న అమెరికా, బ్రిటన్ పెద్దగా ఖాతరు చేయలేదు.
ఇరాన్కు సహాయంగా యుద్ధంలోకి దిగుతామని ఆదివారం యెమెన్ సైన్యం ట్వీట్ చేసింది. ఇప్పటికే ఇరాన్పైకి రెండు హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను ప్రనయోగించినట్టు ప్రకటించుకుంది. మరోపక్క ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది. ఇజ్రాయెల్ కోసం తమ మిలటరీ బలగాలను మిడిల్ ఈస్ట్కు తరలిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ప్రకటించారు.
ఇజ్రాయెల్పై అత్యాధునిక క్షిపణిని ప్రయోగించినట్టు ఇరాన్ ప్రకటించింది. ఒమన్ మధ్యవర్తిత్వంతో ఆదివారం జరగాల్సిన ఇరాన్ ఆరో విడత చర్చలు రద్దయ్యాయి. ఇజ్రాయెల్ దాడుల వెనుక అమెరికా హస్తం ఉందని ఇరాన్ ప్రధాని పెజిస్క్విన్ ఆరోపించినట్టు ఫార్స్ స్టేట్ మీడియా ఏజెన్సీ తెలిపింది. ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం నెలకొల్పేందుకు సంభాషణలు మొదలైనట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
దాడులు పూర్తయ్యాయి
టెహ్రాన్లోని ఇరాన్ ప్రభుత్వ అణ్వాయు ధ ప్రాజెక్టుపై దాడులు పూర్తయినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. అణు ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం, ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం మీద కూడా దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ సై న్యం ఎక్స్లో పేర్కొంది. ఇరాన్లో ఉన్న ఆ యుధ కర్మాగారాలను వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం అక్కడి ఉద్యోగులను హెచ్చరించింది. టెహ్రాన్లో ఉన్న ష్రహన్ చ మురు డిపోపై, టెహ్రాన్ సమీపంలోని చమురుశుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసిందని ఇరాన్ ఆరోపించింది.
ఫ్రాన్స్లో అలర్ట్..
ఇరాన్-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఫ్రాన్స్ అప్రమత్తమైంది. తమ భూభాగంలో యూదులు, అమెరికన్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ యుద్ధానికి అమెరికానే పరోక్ష కారణం అని ఇరాన్ భావిస్తుండటంతో ఫ్రాన్స్లో ఉన్న అమెరికన్ పౌరులకు కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెం చాలని ఫ్రాన్స్ మంత్రి బ్రూనో ఆదేశించారు.
ఇరాన్ను హెచ్చరించిన ట్రంప్
ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో అమెరికా ప్రయేయం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. అయినా ఇరాన్ తమపై దాడికి దిగితే తమ సాయుధ దళాలు టెహ్రాన్పై విరుచుకుపడతాయని వార్నింగ్ ఇచ్చారు. ‘ఇరాన్ ఎలా దాడి చేసినా సమర్థవంతంగా తిప్పికొడతాం. టెహ్రాన్-టెల్ అవీ వ్ యుద్ధాన్ని ఆపడం తనకు చాలా ఈజీ.’ అని పేర్కొన్నారు. ఇరాన్ అమెరికాతో అణుఒప్పందం కుదుర్చుకోకపోతే ఏమీ మి గలద ని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఆరో విడత చర్చలు రద్దు
ఇరాన్-అమెరికా మధ్య అణుఒప్పందం కోసం ఒమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చలు కొలిక్కి రావట్లేదు. ఇప్పటికే ఐదు సార్లు ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అయినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఆదివారం జరగాల్సిన ఆరో విడత చర్చలను రద్దు చేశారు. ఇజ్రాయెల్ ఇంత దారుణంగా దాడులు చేస్తున్నపుడు చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బా స్ తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్ వేయగా.. అందు కు ట్రంప్ నో చెప్పినట్టు పలు కథ నాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై స్పంది ంచేందుకు నెతన్యాహు నిరాకరించారు.
గ్యాస్ ఉత్పత్తి నిలిపివేసిన ఇరాన్
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి క్షేత్రం అయిన సౌత్ పార్స్ క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తిని ఇరాన్ పాక్షికంగా నిలిపివేసింది. ఇజ్రాయెల్ వరుసదాడులతో అక్కడ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ గ్యాస్ ఉత్పత్తి క్షేత్రం ఇరాన్కు ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. మరోపక్క ఇరాన్ కూడా ఇజ్రాయెల్ నగరాలపై దాడులను ఉధృతం చేసింది.
ఇజ్రాయెల్ ప్రధాన నగరాలైన జెరూసలేం, టెల్ అవీవ్లోని పలు ప్రాంతాల్లో వైమానిక దాడుల సైరన్లు కూడా మోగాయి. ఇరాన్కు చెందిన క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలు, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తి క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. మూడో రోజు కూడా ఇజ్రాయెల్ ప్రధాన విమానాశ్రయాన్ని మూసేశారు. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్లో అగ్రశ్రేణి ఆర్మీ అధికారులతో సహా, అణు శాస్త్రవేత్తలను కూడా మట్టుబెట్టింది.
ఇరాన్-ఇజ్రాయెల్ ఒప్పందం కుదుర్చుకోవాలి: ట్రంప్
ఇజ్రాయెల్-ఇరాన్ ఒప్పందం కు దుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘ఇరాన్-ఇజ్రాయెల్ ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇటీవల నేను భారత్-పాకిస్థాన్ మధ్య ఒప్పందం కుదర్చినట్లే ఇది కూడా జరుగుతుంది. అమెరికాతో వాణిజ్యాన్ని ఉపయోగించి ఇరు దేశాల అద్భుతమైన నేతలతో చర్చలు జరిపి, వారు త్వరితగతిన ఓ నిర్ణయానికి వచ్చేలా చేసి.. వివాదం ఆపగలిగా. నా మధ్యవర్తిత్వంతో ఎన్నో దేశాల మధ్య శాంతి నెలకొంది.
ఆ క్రెడిట్ను తీసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. నా జోక్యం వల్లే ఈజిప్ట్, ఇథియోపియాల మధ్య నైలు నదిపై నిర్మాస్తున్న డ్యామ్ విషయంలో తలెత్తిన వివాదం సద్దుమణిగింది. అదే విధంగా ఇరాన్-ఇజ్రాయెల్ల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుంది. ప్రస్తుతం అనేక ఫోన్ కాల్స్, సమావేశాలు జరుగుతున్నాయి.’ అని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్టు చేశారు.
ఇజ్రాయెల్ దాడులు ఆపితే మేమూ ఆపుతాం: ఇరాన్
ఇజ్రాయెల్ కనుక దాడులు ఆపేస్తే తాము కూడా దాడులకు పుల్ స్టాప్ పెడతామని ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ పేర్కొన్నారు. కేవలం ఆత్మరక్షణ కోసమే టెల్ అవీవ్పై దాడులు చేశామని వెల్లడించారు. ది సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై దాడి చేసి ఇజ్రాయెల్ అతిపెద్ద తప్పు చేసిందని ఆయన మండిపడ్డారు. ఇజ్రాయెల్ పరస్పర దాడులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.