08-06-2025 12:46:59 AM
బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల కేటాయిం పుల్లో భారీ అవకతవకలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే డా క్టర్ పాల్వాయి హరీశ్బాబు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను మాత్ర మే గుర్తించి ఇం దిరమ్మ ఇండ్లు కేటాయించారని, తద్వారా నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఇచ్చే ఒకటీఅరా ఇళ్ల కోసం హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, జిల్లాల్లో ఉన్న హౌసింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతేడాది నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటా యిస్తున్న ట్టు చెప్పినా, పైసా నిధులు విడు దల చేయలేదన్నారు. ఈ ఏడాది ఇప్పటి వర కు ఇందిరమ్మ ఇళ్లపై ఊసే లేదన్నారు. వర్షాకాలం ప్రారంభంలో ఇప్పుడు ఇండ్లం టూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు.
దీంతో ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందుబాటులో లేక ఇబ్బందులు పడతారని, సిమెం ట్ బస్తా లు పెట్టడానికి కూడా స్థలం ఉండదన్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇండ్ల కేటాయింపు పేరుతో కాంగ్రెస్ సర్కారు ప్రయతిస్తోందన్నారు. అక్రమంగా చేసిన ఇండ్ల కేటా యింపులను రద్దు చేసి అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.