calender_icon.png 8 June, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం ప్రస్తుత పరిస్థితికి కేసీఆరే బాధ్యుడు

08-06-2025 12:47:54 AM

అవకతవకల నిగ్గు తేల్చాల్సింది రాష్ట్రప్రభుత్వమే..

  1. ఆ పని పక్కనబెట్టి బీజేపీ నేతలను విమర్శించడం సరికాదు..
  2. ఈటల కమిషన్ ఎదుట హాజరైంది 
  3. నాటి ఆర్థికశాఖ మంత్రిగానే.. 
  4. బీజేపీ ఎంపీగా మాత్రం కాదు.. ఆయన నిజాయతీగా విచారణకు వెళ్లారు.. 
  5. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 
  6. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాం తి): కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి నాటి ముఖ్యమంత్రి కేసీఆరే పూర్తి బాధ్యుడని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కేసీఆర్ కేవలం అప్పులు తీసుకొ చ్చేందుకే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.

ఆ అవకతవకలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, కానీ.. సర్కార్ మాత్రం బీజేపీ నేతలను నిందించే పనిలో నే బిజీగా ఉంటుందని ధ్వజమెత్తారు. ఎం పీ ఈటల రాజేందర్ ఇటీవల జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కిషన్‌రెడ్డి స్పందించారు. ఈటల రాజేందర్ ఎంతో నిజాయతీగా కమిషన్ ఎదుట హాజరయ్యారని చెప్పుకొచ్చారు.

ఈటల, కేసీఆర్ ఫోన్‌లో సంభా షించుకున్నారని కాంగ్రెస్ నేతలు లేనిపోని అసత్యాలు చెప్తుండటం విచారకరమన్నా రు. ఈటల విచారణకు హాజరైంది.. నాటి ఆర్థికశాఖ మంత్రిగానే తప్ప.. బీజేపీ ఎంపీ గా కాదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన రిపోర్ట్‌ను కూడా తప్పుబట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ దర్యాప్తు జరగాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని, కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించటం లేదని దుయ్యబట్టారు.

కేసీఆర్‌కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కమిషన్ ఎదుట వాస్తవాలు చెప్పాలని సవాల్ విసిరారు. గోదావరి జలాల ఆధారంగా ఏపీలో అక్కడ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పారు. తెలంగాణకు ఒకవేళ అన్యా యం జరిగిందని భావిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాయవచ్చని సూచించారు. బనకచర్లపై కేంద్రం తప్పకుండా తెలంగాణ అభిప్రాయం తీసుకుం టుందని స్పష్టం చేశారు.

త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక..

త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని, తనకు మరోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగే ఉద్దేశం లేదని కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి కుండ బద్దలు కొట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ముందన్న లక్ష్యమని వెల్లడించారు. ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మీడియా ఆయన్ను ప్రశ్నించింది.

వాటికి కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. రాజాసింగ్ అంశం తమ పార్టీ అంతర్గతమైనదని, దానిని తామే సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, నగరంలో 80శాతం వీధి దీపాలు వెలగడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు దాపురించాయని అభిప్రాయపడ్డారు.

హైడ్రా నిక్షక్షపాతంగా వ్యవహరిస్తున్నదని తాము భావించడం లేదని, గతంలో కూడా జీహెచ్‌ఎంసీ అక్రమ నిర్మాణాలు కూల్చివేసేదని, అంతకంటే కొత్తగా హైడ్రా వ్యవహరించడం లేదన్నారు. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు బీజేపీ కష్టపడి పనిచేస్తుందని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.

మెట్రో విస్తరణ పనులను తాము అడ్డుకంటున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో టీడీపీ, బీఆర్‌ఎస్ హయాంలోనూ మంత్రిగా వ్యవహరించారని, అలా ఆయన అన్ని పార్టీలకు చెందిన అమాత్యుడని ఎద్దేవా చేశారు. సింగరేణి యాజమాన్యం చేసిన అప్పుల్లో, సింహభాగం బీఆర్‌ఎస్ హయాంలో చేసినవేనని చెప్పుకొచ్చారు.

పార్టీ సోషల్‌మీడియా వర్క్‌షాప్ సందర్శన

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ సోషల్ మీడియా వర్క్‌షాప్‌ను శనివారం కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సందర్శించారు. సోషల్ మీడియా సభ్యులు పార్టీని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.