calender_icon.png 28 June, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షోభంలో సాగునీటిరంగం

28-06-2025 01:50:40 AM

మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): సాగునీటి రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మాజీమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఉన్న ప్రాజెక్టుల నిర్వ హణ లేక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన లేక తెలంగాణ సాగు నీటి రంగాన్ని ప్రభుత్వం సంక్షో భంలోకి నెడుతున్నదని శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కండ్లు తెరవాలని, మేడిగడ్డపై దుష్ర్పచారం ఆపేసి ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. ప్రాజెక్టులను పడావు పెట్టి, నిర్వహణ గాలికి వదిలి ఏపీకి నీళ్లు వదులుతున్న ఘనత రేవంత్‌రెడ్డిదని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ కుంగిన వెంటనే ఎన్డీఎస్‌ఏకు లేఖ రాసిన కిషన్‌రెడ్డికి కాంగ్రెస్ హ యాంలో జరుగుతున్న ప్రాజెక్టుల ప్రమాదా లు ఎం దుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది లోనే కొత్తగా ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తామని చెప్పి, ఆరువేల ఎకరాలకు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ట్రాఫిక్ నిబంధనలపై ప్రతిఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని మాజీమంత్రి హరీశ్‌రావు సూచించారు. నగరంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై ఎక్స్ వేదిక గా ఆవేదన వ్యక్తం చేశారు.

మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో జరిగిన హృదయవిదారకమైన రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించా రు. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడు టిప్పర్ చక్రాల కింద దుర్మరణం పాలుకావడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనల అమలు, డ్రైవర్లకు తగిన శిక్షణ, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా కట్టుదిట్టమైన చర్యలు, ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు.