16 April, 2026 | 11:05 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

తెలంగాణలో డ్రగ్స్ కాంట్రాక్ట్ తీసుకున్న కేటీఆర్

28-06-2025 01:50 AM

పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం 

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : తెలంగాణలో మాజీ మం త్రి కేటీఆరే డ్రగ్స్‌ను కాంట్రాక్ట్ తీసుకున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఆరోపించారు. ఇతర దేశాల నుంచి తెలంగాణకు డ్రగ్స్ తీసుకొచ్చారని ఆరోపించారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ. 10 వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను వేయి మందితో తెలంగాణలోని పట్టణా లు, గ్రామాల్లో  సరఫరా చేశారని ఆ యన విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీల కుటుంబాలను కేటీఆర్ సర్వనాశనం చేశారని, ఎంతో మంది యువత డ్రగ్స్‌కు బానిసై చనిపోయారని దుయ్యబట్టారు. 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ అనేవే లేవని 2014 తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకనే రాష్ట్రంలో యు వతకు డ్రగ్స్ అలవాటయ్యాయని ఆరోపించారు.