16-06-2025 12:00:00 AM
కామారెడ్డి, జూన్ 15 (విజయక్రాంతి): అక్రమ రేషన్ బియ్యం దందా కామారెడ్డి జిల్లాలోఆగడం లేదు. అక్రమార్కులు, రేషన్ డీలర్లు కొందరు కుమ్మక్కై రేషన్ దందా కొనసాగిస్తున్నారు. అక్రమ రేషన్ బియ్యం దందా నిర్వహించే వ్యాపారులకు మూడు నెలల రేషన్ ఒకేసారి రావడంతో వారికి వ్యాపారం కలిసి వచ్చింది.
గతంలో నెల నెల రేషన్ బియ్యాన్ని సేకరించి అమ్మేసి ముఠా ఈసారి జూన్ నుంచి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో రేషన్ డీలర్లకు, అక్రమ రేషన్ బియ్యం దందా నిర్వహించే ముఠాకు వ్యాపారం మరింత కలిసి వచ్చినట్లయిoది. రేషన్ షాప్ ల వద్ద బియ్యం సేకరణ చేపడుతున్నారు. ఒక్కరికి జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల బియ్యం రావడంతో కొంతమంది తమకేందుకు అని రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్లకి అంటగడుతున్నారు.
ఇదే అదను గా భావించి రేషన్ డీలర్ లు బియ్యం పంపిణీ చేసే చోటే ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు సాగిన దందా సన్న బియ్యం పంపిణీ కూడా దందాను కొనసాగిస్తున్నారు. మూడు నెలల బియ్యం ఓకే సారీ పంపిణీ చేస్తుoడడoతో అక్రమ బియ్యం దందా కొనసాగించే వ్యాపారుల కు మరింత కలిసి వచ్చినట్లయిo ది.
గతంలో దొడ్డు బియ్యం అక్రమ దందా కొనసాగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తే ఆ సన్న బియ్యం కూడా ఆక్రమ ముగా కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్లు మరికొందరు అక్రమ బియ్యం దందాను కొనసాగిస్తున్నారు. రేషన్ బియ్యం అమ్మేవారి సంఖ్య ఎక్కువ మొత్తంలో ఉండడంతో వారి వద్ద నుంచి మధ్య దళారులు కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు అమ్ముతున్నారు.
నెలకు లక్షల్లో రేషన్ బియ్యం చేతులు మారుతుండగా ఈ నెలలో మరింత రేట్టింపు స్థాయిలో అక్రమ బియ్యం దందా ను కొన సాగిస్తున్నారు. రేషన్ అక్రమ బియ్యం దందా ఎదేచ్ఛగా కొనసాగుతున్న అధికారులకు ఫిర్యాదులు చేసిన నెలసరి మామూళ్లతో తమకు పట్టనట్లుగా విజిలెన్స్ రెవిన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో మూడు పువ్వులు ఆరు కాయలు అనే సామెత లాగా అక్రమ రేషన్ బియ్యం దందా కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 761 రేషన్ దుకాణాలు ఉండగా రేషన్ డీలర్లకు జూన్ మాసంలో మూడు నెలల బియ్యం కోట ఒకేసారి రావడంతో స్టాక్ ఉంచుకోలేక మధ్య దళారులకు అ క్రమంగా రేషన్ బియ్యాన్ని విక్రయిస్తున్నారు.
రేషన్ అక్రమ బియ్యం దందాను అరికట్టాల్సిన రెవిన్యూ, పోలీస్, పౌర సరఫరాల శాఖల అధికారులకు నెలసరి మామూలు చెల్లించడం వల్లనే ఈ ఆక్రమ రేషన్y బియ్యం దందా కొనసాగిస్తున్నారు. కొంతమంది అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి మమ అనిపిస్తున్నారు. ఇటీవల కామారెడ్డి పట్టణంలో 500 క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడడమే ఇందుకు నిదర్శనం.
రేషన్ దంద వెనుక రైస్ మిల్లర్లు
రేషన్ దందా వెనుక రైస్ మిల్లర్లు అక్రమ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ డంపులు చేస్తున్నారు. మారుమూల గ్రామాలు అడ్డాలుగా చేసుకొని అక్రమ డంపులు చేసి రాత్రికి రాత్రి రేషన్ బియ్యం దందా కొనసాగిస్తున్నారు.
రీసైక్లింగ్ దందాకు చెక్ పెట్టి సన్న బియ్యం కొనుగోలు
రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని గతంలో రేషన్ దొడ్డి బియ్యం రావడంతో రీసైక్లింగ్ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం సన్న బియ్యం విక్రయిస్తుండడంతో రీసైక్లింగ్ చేయకుండానే ప్రభుత్వానికి అప్పగించవచ్చని రైస్ మిల్లర్లు భావిస్తున్నారు. రైస్ మిల్ వ్యాపారులకు మరింత కలిసి వచ్చిందని అంటున్నారు.
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ బిచ్కుంద జుక్కల్ పిట్లం మద్నూర్ దోమకొండ రామారెడ్డి తదితర మండలంలో మారుమూల మండలాల్లో సైతం డంపులు చేసి విక్రయాలు చేపడుతున్నారు. రైస్ మిల్లులే అడ్డాగా పెట్టడం తోపాటు గోదాములు అడ్డాగా చేసుకొని రేషన్ బియ్యం నిల్వలు చేస్తున్నారు.
ఫిర్యాదులు వస్తే సీజ్ చేస్తాం
కామారెడ్డి జిల్లాలో రేషన్ బియ్యం ను డీలర్లు వినియోదారులకు ఇవ్వకుండా అక్రమంగా అమ్మకాలు చేపడితే అలాంటి రేషన్ షాప్ లను గుర్తించి సీజ్ చేస్తాం. అక్రమ విక్రయాలు చేపడితే రైస్ మిల్లులను సైతం సీజ్ చేస్తాం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీం ప్రత్యేకంగా ఏర్పాటు చే సిశాం. ఎక్కడ కూడా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం.
మల్లికార్జున్ బాబు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, కామారెడ్డి