calender_icon.png 16 June, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ స్వగృహ ప్లాట్స్ ఇవ్వండి..

15-06-2025 11:31:53 PM

టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు, ఎంప్లాయ్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాసరావు..

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మంలోని టిఎన్జీవో ఫంక్షన్ హాల్ లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అసోసియేషన్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఖమ్మం సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షులు కట్టా కిషోర్ కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు, ఎంప్లాయ్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాసరావు(JAC State Secretary General Sri Eluri Srinivasa Rao) పాల్గొని మాట్లాడుతూ... గతంలో టీఎన్జీవో సభ్యులకు ఇండ్ల నిర్మాణం కొరకు స్థలాలు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో 2011లో ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా గెజిటెడ్ అధికారులకు హౌస్ బిల్డింగ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. 

ప్రజా పాలన  వచ్చిన తర్వాత గెజిటెడ్ ఉద్యోగులకు ఇండ్ల స్థలాల విషయంలో  సుప్రీంకోర్టు తీర్పు ఉండటం వలన స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదు.. కాబట్టి ఖమ్మంలోని పొన్నెకల్ రెవెన్యూ లో ఉన్న రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ గెజిటెడ్ ఉద్యోగాలకు ఇచ్చే విధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), అదేవిధంగా రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని కలిసి గెజిటెడ్ ఉద్యోగులకు ఇవ్వమని అడగడం జరిగింది అన్నారు.

జిల్లాలోని 1632 మంది గెజిటెడ్ ఉద్యోగులు ఉన్నారు. వారికి ఈ రోజు వరకు కూడా ఇండ్ల స్థలాలు ఏ ప్రభుత్వము ఇవ్వలేదు. మీ ఆధ్వర్యంలో ఇస్తే ఉద్యోగస్తులు మేలు జరుగుతుంది అని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టి ఎన్ జి ఓ జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ కార్యదర్శి మోదుగు వేలాద్రి ట్రెజరర్ కొండపల్లి శేషు ప్రసాద్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ యు .మహేష్ బాబు ట్రెజరర్ రమేష్  డైరెక్టర్స్ డాక్టర్. సంజయ్  శ్రీమతి పి.సుధారాణి, నాయకులు గుంటుపల్లి శ్రీనివాసరావు కార్యదర్శి బుల్లెట్ శ్రీనివాస్ అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు మన్యం రమేష్ బాబు కనపర్తి వెంకటేశ్వర్లు మల్లెల రవీంద్ర ప్రసాద్ భాస్కరరావు హరీష్ రాంబాబు బాలాజీ డాక్టర్ నండ్రు గోపి పుష్పరాజు N. మాధవరావు తదితరులు పాల్గొన్నారు.