1 July, 2026 | 7:58 PM

Breaking News

పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •  

మున్సిపల్, విద్యా శాఖల్లో అవినీతి వెనుక సీఎం హస్తం ఉందా?

18-03-2026 12:00 AM

బీజేపీ నేత కోలన్ శంకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు

బడంగ్‌పేట్, మార్చి 17: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్, విద్యా శాఖల్లోనే అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని బీజేపీ రాష్ట్ర కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కోలన్ శంకర్ రెడ్డి ధ్వజ మెత్తారు. మంగళవారం గాయిత్రి నగర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ తీరుపై నిప్పులు చేరిగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమున్సిపల్, విద్యా శాఖల బాధ్యతలు సీఎం వద్దే ఉన్నాయని, అధికారుల అవినీతి ఆయనకు తెలిసే జరుగుతోందా లేక ఆయన ప్రోత్సాహంతోనే సాగుతోందా అని శంకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల వివిధ మున్సిపాలిటీల్లో అధికారులు ఏసీబీకి చిక్కడం రాష్ట్రం లో పెచ్చుమీరిన అవినీతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డికిని జాయితీ ఉంటే, ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గౌరీ శంకర్, బీజేపీ నాయకులు గడ్డం జగన్, సురేష్, కాశీరాం యాదవ్, జగన్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.