18 March, 2026 | 9:19 AM

రేషన్ బియ్యం పట్టివేత

18-03-2026 12:00 AM

అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలోని గోదాముల్లో నిల్వ చేసిన 420 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం 

ఎల్బీనగర్, మార్చి 17 : సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో ఒక గోదాముపై సోమవారం తెల్లవారుజామున దాడి చేసి, 420 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గోదాం నిర్వాహకుడు రమావత్ శ్రీకాంత్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ప్రభుత్వం సన్నబియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.

ఇందులో భాగంగా  సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలోని ఒక గోదాముపై దాడి సుమారు 420 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ డీఎస్సీ రమేశ్ రెడ్డి, అధికారులు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.