calender_icon.png 8 June, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనులో ఇజ్రాయెల్

31-05-2025 12:00:00 AM

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఎప్పటిలాగే అమెరికా ఒత్తిడి తెచ్చింది. గతంలో అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తి త్వంతో రెండు నెలలపాటు కాల్పుల విరమణ జరిగినా మార్చి 18 తర్వాత పరిస్థితులు మారాయి. గాజాపై ఇజ్రాయెల్ సైనిక దాడులు పెద్ద ఎత్తున కొనసాగాయి. గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం పది వారాల్లో గాజాపై విరుచుకుపడి నాలుగు వేల మందిని పొట్టన పెట్టుకుందని హమాస్ ప్రకటించింది.

ఇప్పటికే మరుభూమిగా మారిన గాజాలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. గాజాకు సరుకులు అందే అన్ని మార్గాలను ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా మూసి వేసింది. చరిత్రలో అతిపెద్ద మానవ విషాదంగా పశ్చిమాసియా భూభాగంలో గాజా ఇప్పుడు కనిపిస్తున్నది. కొ న్ని నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమానికి స్త్రీలు, పిల్లలు కూ డా బలికావడం ఒక ఎత్తయితే, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

వారికి తాగేందుకు నీరుకూడా లేదు. రఫాలో నిర్వాసితులను ఆదుకునేందుకు అమెరికా మద్దతుతో సహాయ కేంద్రాన్ని తెరిచినా, అక్కడి పరిస్థితులను అదుపు చేసే మిషతో ఇజ్రాయెల్ దళాలు వారిపై కూడా విచక్షణారహితంగా కాల్పు లు జరిపాయి. 2023 నవంబర్‌లో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మందిని కాల్చి చంపారు. దాదాపు 250 మంది ఇజ్రాయెలీలను బందీ చేశారు.

అప్పటి నుంచి ఇజ్రాయెల్ తన ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. దానితో గాజా భూభాగం ఇప్పుడు ఎటు చూసినా శిథిలాలతో గుర్తించలేనంతగా మారింది. దవాఖానాలు, విద్యాసంస్థల్ని కూ డా ఇజ్రాయెల్ వదిలి పెట్టలేదు. గాజాను తూట్లు పొడిచిన నెతన్యాహు ప్రభు త్వ తీరును ఇజ్రాయెల్‌కు మద్దతు నిస్తున్న ఐరోపా దేశాలు సైతం గర్హించా యి. గాజాపై దాడులు ఆపకపోతే ఇజ్రాయెల్‌పై నిర్దిష్టంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించాయి.

అమానవీయంగా సైనిక దాడులకు పాల్పడితే ఇక తమ ఆయుధ ఎగుమతులను ఆపేస్తామని జర్మనీ హెచ్చరించింది. గాజాలోని పరిస్థితులను గమనించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కూ డా ఇజ్రాయెల్‌లో తను తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే, పరిస్థితులను చక్కదిద్దేందుకు కాల్పుల విరమణ ఒక్కటే మార్గమని భావించిన అమెరికా అందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

తాజాగా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించినా, ఆ ఒప్పందం తమకు అనుకూలంగా లేదని హమాస్ తిరస్కరించింది. గాజాపై దాడులతో ఒంటరైన ఇజ్రాయెల్‌కు ఇది సంకటస్థితే. ప్రపంచ దేశాలన్నీ నెతన్యాహు ప్రభుత్వ తీరును విమర్శిస్తున్న ఈ సందర్భంలో ఇకపై ఎలాంటి విధానం అనుసరించాలో ఆ దేశానికి అంతుబట్టని విషయంగా మారుతుంది.

దాదాపు 77 ఏళ్ల క్రితం యూదుల దేశంగా ప్రపంచపటంలో చోటు దక్కించుకొన్న ఇజ్రాయెల్‌పై ‘హోలోకాస్ట్’, హిట్లర్ మారణకాండ నేపథ్యంలో సర్వత్రా సానుభూతి వుండేది. ఇప్పుడు పలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ అదే మారణకాండ సాగించిన దేశంగా చరిత్రలో నిలిచిపోయేట్టుగా ఉంది. అరబ్ దేశాలు ఎప్పటినుంచో పలస్తీనా, ఇజ్రాయెల్ రెండు దేశాలుగా మనుగడ సాగించాలని, ఇందుకు ప్రపంచ దేశాలు గుర్తింపు నివ్వాలని చెపుతున్నాయి.

కానీ, నెతన్యాహు ఈ ప్రతిపాదనను మొదటినుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇజ్రాయెల్‌పై ఒకప్పుడు పట్టు సాధించిన నెతన్యాహుకు ఇప్పుడు సొంత దేశంలో అంతగా ప్రజాదరణ లేదు. తనపై వున్న అవినీతి ఆరోపణలనుంచి దేశప్రజల దృష్టి మరల్చేందుకైనా ఆయన హమాస్‌పై యుద్ధం కొనసాగించక మానరు.