calender_icon.png 7 June, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనసెరిగిన మహామార్గదర్శి

31-05-2025 12:00:00 AM

ప్రాచ్యవిద్య భూషితులైన రవ్వా శ్రీహరి నిరాడంబర జీవితం కష్టపడి, ఇష్టపడి చదివే మాలాంటి విద్యార్థులకు ఎంతో మార్గదర్శకం. అధ్యయన, అధ్యాపనాలను రెండు కళ్లుగా భావిస్తూ సుదీర్ఘ రచనా వ్యాసంగాన్ని తపస్సువలె సాగించారు.

నేను ‘ప్రాచీన కావ్యాలు  గ్రా మీణ జీవన చిత్రణ’ అనే అంశం మీద పరిశోధన చేసి పీహెచ్‌డీ డిగీ సంపాదించాను. ఆ గ్రంథాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఆవిష్కరించడానికి సభ ఏర్పాటుచేశారు. ఆ సభలో సి.నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా, జి.వి. సుబ్రహ్మణ్యం, నాయని కృష్ణకుమారి, ఆనందమూర్తి, రవ్వా శ్రీహరి వక్తలుగా పాల్గొన్నారు. ఈ సభలో 1971 నుంచీ నన్నెరిగిన రవ్వా శ్రీహరి మాట్లాడుతూ 

“చెన్నప్ప నన్ను వెంటాడుతూ వస్తున్నాడు. నాది పేదరికం, ఆయనది పేదరి కం. నాది ప్రాచ్యవిద్య, ఆయనదీ ప్రాచ్యవిద్య. నా ఉద్యోగం మొదట పాఠశాలలో, ఆయనదీ అంతే. ఆ తర్వాత నేను కాలేజీ లెక్చరర్‌ను అయ్యాను. ఆయనా ప్రగతి కళాశాలలో లెక్చరర్ అయ్యాడు.

నేను పీహెచ్‌డీ చేశాను, తానూ చేశాడు. నేను ఎంఏ (సంస్కృతం)లో స్వర్ణపతక గ్రహీతనైతే ఆయనా తెలుగు (ఎంఏ)లో స్వర్ణపత క గ్రహీత. నేను విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా చేరాను, ఆయనా చేరాడు. ఇలా ఆయన నన్ను వెంటాడుతూ వస్తున్నాడు..” అని చమత్కరించారు. వారి మాటలకు స్పందనగా

“నిజమే సార్ మీరన్న మాట. కాకపోతే, నేను మిమ్మల్ని వెంటాడుతూ రావడం లే దు. మీ శిష్యుణ్ణి కాబట్టి, మీ వెంట ఆడు తూ వస్తున్నాను..” అన్నాను వినయంగా. నిజంగా ఆచార్య రవ్వా శ్రీహరి మా తరం వారెందరికో ఆదర్శ గురువు.

హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం లో ఆచార్యులుగా చేరిన సందర్భంలో నగరంలో ఒక సభ జరిగింది. దానికి నేనే వ్యా ఖ్యాతను. రవ్వా శ్రీహరి వారి జీవితాన్ని ఆమూలాగ్రం గమనిస్తూ, వారిని ఆదర్శంగా తీసుకొని సాగుతున్న నేను

“సారుకు చిన్నతనంలోనే తల్లి చనిపోతే, సంస్కృతం తల్లియై పాలిచ్చి పోషిం చింది..” అన్నాను. ఆయన జీవన నేపథ్యా న్ని పురస్కరించుకొని మాట్లాడాను. నా మాటలకు వారు కంటతడి పెట్టారు. 

అధ్యయన, అధ్యాపనాలు..

రవ్వా శ్రీహరి మాతృ వియోగంతో మేనమామల ఇంట్లో చేరారు. తండ్రి తన ను చదివించలేని పరిస్థితుల్లో శూన్యం ఏర్పడింది. కాని, ఆయన విద్యాతృష్ణ ఆగలేదు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి సంస్కృత విద్యాపీఠంలో చేరి ఐదేళ్లు చదివి, ఓయూ ఎంట్రెన్స్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

తర్వాత సీతా రాంబాగ్ సంస్కృత కళాశాలలో డిప్‌ఓఎల్, బిఓఎల్ చదివారు. పిమ్మట ఎంఏ (సంస్కృతం)లో స్వర్ణపతకం సాధించారు. తెలుగు ఎంఏకూడా ఉంది కనుక వారు ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి, పీహెచ్‌డీ డిగ్రీ పొందారు. 

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే కాక హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం లో చాలాకాలం పనిచేశారు. 2001 నుంచి 2005 వరకు ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా బాధ్యతలు నిర్వహిం చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ సంఘం సభ్యులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వారికి ఒక ఆచార్యునిగా, పరిపాలనాదక్షునిగా ఉన్న పేరుకంటే ఓ రచ యితగా ఎంతో గొప్ప పేరుంది.

ఆయన ప్రాచీన కావ్యభాషా వ్యాకరణ శాస్త్రంలోను, మాండలిక భాషా శాస్త్ర పరిశోధ నలోను, నిఘంటు నిర్మాణంలోను గొప్ప విద్వాంసునిగా పేరు గాంచారు. ప్రాచ్యవిద్య భూషితులైన రవ్వా శ్రీహరి నిరా డంబర జీవితం కష్టపడి, ఇష్టపడి చదివే మాలాంటి విద్యార్థులకు ఎంతో మార్గదర్శకం. అధ్యయన, అధ్యాపనాలను రెండు కళ్లుగా భావిస్తూ సుదీర్ఘ రచనా వ్యాసంగాన్ని తపస్సువలె సాగించారు.

ఆయన విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నప్పుడు తిక్కన భాషా సాహిత్యాలు, కోరాడ రామకృష్ణయ్య జీవితం, చలం, పుట్టపర్తి, విశ్వనాథ, జాషువా, గురజాడ, అన్నమాచార్య వంటివారి సారస్వతాలపై జాతీయ సదస్సులు నిర్వహించి, పత్ర సమర్పకులైన పరిశోధకులకు కల్పతరువుగా నిలిచారు. ‘పాణినీయ అష్టాధ్యాయి’, ‘ప్రాకృతాంధ్ర నిఘంటువు’లకు సంపాదకత్వం వహించారు.

వివిధ పత్రికలలో ఆయన ప్రచురించిన పరిశోధనాత్మక వ్యా సాలు సుమారు 150 దాకా ఉన్నాయి. ‘ఆకాశవాణి’లో సుమారు 8 సంవత్సరాల పాటు శ్రోతలకు సంస్కృత పాఠాలు చెప్పా రు.  సంస్కృతంలో రవ్వా శ్రీహరి చూపిన ప్రతిభ అనన్య సామాన్యం. తెలుగులో సులభంగా ఉండే విధంగా ‘లఘు సిద్ధాం త కౌముది’ రచించారు. ‘మాతృగీతమ్’ అనే వీరి సంస్కృత శతకం కరుణ రసాత్మకమైంది.

సంస్కృత న్యాయాలను వివరి స్తూ ‘సంస్కృత న్యాయదీపిక’ను ప్రచురించారు. ‘సినారె ప్రపంచ పదుల’ను ‘ప్రపం చ పదీ’ పేరుతో సంస్కృతంలోకి అనువదించగా, దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. జాషువా ‘ఫిరదౌసి’ కావ్యాన్ని, శేషప్పకవి తెలుగు నరసింహ శతకాన్ని సంస్కృతంలోకి అనువదించారు. అన్నిటికంటే ఆయన చేసిన గొప్ప పని ఏమంటే, ‘పాణిని అష్టాధ్యాయి’ని తెలుగులోకి అనువదించడం. ఇది 2,500 పుట ల్లో అచ్చయింది. 

మహోన్నత సాహితీ వ్యక్తిత్వం

శ్రీహరి తయారుచేసిన పదకోశాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. ‘సంకేత పదకోశం’ (1973), ‘వ్యాకరణ పదకోశం’ (1978), ‘నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం’ (1986), ‘అన్నమయ్య పదకోశం’ (2012) మొదలైనవి వారికెంతో పేరు తెచ్చాయి. ముఖ్యంగా ఆయన నిర్మించిన ‘శ్రీహరి నిఘంటువు’ (2004)ను నిఘం టు నిర్మాణ చరిత్రలోనే సువర్ణాధ్యాయం. ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’లో కనిపించని తెలుగుపదాలను సేకరించి ఈ నిఘంటువును రూపొందించారు.

వీరి కావ్య పరిశీలనకు గీటురాళ్లు ‘అలబ్ధ కావ్య పద్య ముక్తావళి’ తెలుగులో, ‘అలబ్ధ వాఙ్మ యం’ అనే గ్రంథాలు. సంస్కృతాంధ్ర భాషల్లో విరివిగా రచనలు చేసిన ఆచార్య శ్రీహరి సరళ స్వభావులు. నిగర్వి. అజాత శత్రువులుగా పేరు పొందారు.  సంస్కృతంలో వీరు చేసిన సేవలకు తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వారు 2011లో వీరికి ‘మహామహోపాధ్యాయ’ పురస్కారం ఇచ్చారు.

వీరు పొందిన పురస్కారాల్లో ముఖ్యమైనవి ‘పరవస్తు చిన్న యసూరి జాతీయ పురస్కారం’, ‘మండలి వెంకట కృష్ణారావు భాషాసేవ పుర స్కారం’, ‘కాళోజీ మెమోరియల్ అవార్డు’, ‘ఉత్తమ సంస్కృత పండితుడు’ (1993, తెలుగు విశ్వవిద్యాలయం వారిచే), ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు’, ‘ఇరి వెంటి పురస్కారం’, ‘జాషువా సాహిత్య పురస్కారం’, ‘బ్రౌను పురస్కారం’, ‘వ్యాకరణ సార్వభౌమ’ పురస్కారం వంటి వాటితోపాటు గణపతి సచ్చినాంద స్వామి (మైసూరు దత్తపీఠం వారి) ‘స్వర్ణకంకణ పురస్కారం’, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే 2012లో ‘గురజాడ ప్రతిభా పురస్కారం’ (లక్ష రూపాయల నగదు) ఆచార్య శ్రీహరి మహోన్నత సాహితీ వ్యక్తిత్వానికి చెరిగిపోని గురుతులుగా భావించవచ్చు.

 వ్యాసకర్త సెల్: 9885654381