17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వారంలో 270 మందికిపైగా పిల్లలు మృతి

26-03-2025 12:09 AM

గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

న్యూఢిల్లీ: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ తిరిగి దాడులు ప్రారంభించిన వారం వ్యవధిలో 270 మందికిపైగా పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్టు సేవ్ ది చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి గడిచిన వారం రోజులను పిల్లల విషయంలో ప్రాణాంతకమైన రోజులుగా అభివర్ణించింది. రెండో దశ కాల్పుల విరమణకు హమాస్ ఒప్పుకోలేదని ఆరోపిస్తూ గత ఎనిమిది రోజులుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. వరుసగా ఎనిమిదవ రోజు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 23 మంది మరణించగా ఇందులో ఏడుగురు పిల్లలున్నారు.