12-01-2026 10:48:28 AM
శ్రీహరికోట: ఇస్రో వాహక నౌక పీఎస్ఎల్వీ, దేశీయ, విదేశీ వినియోగదారుల కోసం ఒక భూ పరిశీలన ఉపగ్రహంతో పాటు మరో 14 వాణిజ్య పేలోడ్లను మోసుకుని సోమవారం శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది తొలి ప్రయోగంగా చేపట్టిన ఈ మిషన్, ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ కు లభించిన కాంట్రాక్టులో భాగం. 44.4 మీటర్ల పొడవున్న నాలుగు దశల పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ సోమవారం ఉదయం 10.18 గంటలకు ముందుగా నిర్ణయించిన సమయానికి మొదటి ప్రయోగ వేదిక నుండి నింగిలోకి దూసుకెళ్లింది. ఈఓఎస్-ఎన్-1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ62(ISRO PSLV-C62) రాకెట్ కక్ష్యలోకి మోసుకెళ్తుంది.