4 July, 2026 | 8:49 PM

Breaking News

దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •  

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

04-07-2026 07:42 PM

తాసీల్దార్ కు వినతి పత్రంలో తపస్ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి

ముత్తారం,(విజయక్రాంతి): ఉపాధ్యాయులు, విద్యారంగానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) డిమాండ్ చేసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం ముత్తారం మండల తపస్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా తపస్ మండల అధ్యక్షుడు ముదుగంటి సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంధం రమేష్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ అమలు, డీఏల విడుదల, ఈ-కుబేర్‌లో పేరుకుపోయిన బిల్లులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే పెన్షనర్లకు బకాయి బిల్లులు చెల్లించడం, సీపీఎస్ రద్దు, కేజీబీవీ, మోడల్, గురుకుల, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన గ్రాంట్లు వెంటనే విడుదల చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.