4 July, 2026 | 8:43 PM

Breaking News

లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •   రైతు భరోసా నిధులు విడుదల పట్ల కాంగ్రెస్ నాయకుల సంబరాలు   •  

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్

04-07-2026 07:38 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో కొనసాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులను ఆకస్మికంగా సందర్శించి పురోగతిని పరిశీలించి వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు నస్పూర్ మండల కేంద్రంలోని ఈవీఎం గోదాం వద్ద భద్రత చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ పాట్ల భద్రతకు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టామని, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.