26-06-2025 12:00:00 AM
మురళీమోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతోంది ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఈ చిత్రాన్ని టీవీ రవి నారాయణ్ దర్శకత్వంలో ఉషారాణి మూవీస్ బ్యానర్పై వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. మురళీమోహన్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ను, గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ.. “కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మను పొగిడారు.
సన్మానం చేస్తామని లండన్కు రమ్మని పిలిస్తే.. ‘నేను అక్కడికి వస్తే ఇక్కడివారి ఆకలి ఎవరు తీరుస్తారు?’ అని నిరాకరించారు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను తీస్తుండటం ఆనందంగా ఉంది” అన్నారు.
దర్శకుడు రవి నారాయణ్ మాట్లాడుతూ.. ‘నా మొదటి హీరో మురళీమోహన్. ఈ కథను చేయాలని చెప్పిన క్షణం నుంచీ ఇప్పటివరకు ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు’ అని చెప్పారు. ప్రముఖ నిర్మాతలు రామ సత్యనారాయణ, బెక్కెం వేణుగోపాల్, రేలంగి నరసింహారావు, చిత్రబృందం పాల్గొన్నారు.