calender_icon.png 15 November, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

స్కౌట్స్, గైడ్స్ శిక్ష‌ణ జిల్లాలో నిర్వహించడం అభినందనీయం

15-11-2025 10:39:13 PM

మునిప‌ల్లి (విజయక్రాంతి): స్కౌట్స్, గైడ్స్ శిక్ష‌ణ జిల్లాలో నిర్వహించడం అభినందనీయమని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండ‌ల ప‌రిధిలోని లింగంప‌ల్లి గురుకుల పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న స్కౌట్స్, గైడ్స్ శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వహిస్తున్న సందర్భంగా శనివారం నాడు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భారత్‌లో యువతకు క్రమశిక్షణ, సామాజిక సేవ, వ్యక్తిత్వ వికాసం కోసం ఈ సంస్థ ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.12లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. 

ఈ కార్య‌క్ర‌మం రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల సొసైటీ పాఠశాల, కళాశాల ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అలాగే విద్యార్థులు క్ర‌మ శిక్ష‌ణతో క‌లిసి మెల‌సి ఉన్న‌ప్పుడే ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదుగుతార‌న్నారు. ముందుగా డీఈఓ వెంకటేశ్వర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర కమిషనర్ మోహన్ రావు, లీడర్ ట్రైనింగ్ గైడ్ భరతమాత, హిమాలయ హుడ్ బ్యాడ్జి సాల్మన్, అసిస్టెంట్ లీడర్ ర‌వి కిరణ్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి మాధవరెడ్డి, ఎంఈఓ భీమ్ సింగ్, లింగంప‌ల్లి గురుకుల పాఠ‌శాల ప్రిన్సిపాల్ సురభి చైతన్య, ఉపాధ్యాయులు ఆంజనేయులు, సుందర్ రావు, చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యాయులు, జిల్లాలోని పిఈటిలు, పీడీలు  తదితరులు పాల్గొన్నారు.