17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నష్టపరిహరాన్ని సుప్రీం కోర్టు పరిశీలించడం అభినందనీయం

30-10-2025 01:45 AM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి

ముషీరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి) : చేయని నేరానికి శిక్షకు గురైతే బాధితులకు నష్టపరిహరం చెల్లించే అంశా న్ని సుప్రీం కోర్టు పరిశీలించడం అభినందనీయమని తె లంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజాసామ్య సంక్షే మ రాజ్యమైన భారత దేశం లో వ్యక్తికి జీవించే ప్రాథమిక హక్కును మన భారత రాజ్యం గం కల్పించిందని పేర్కొన్నా రు.

ఈ మేరకు బుధవారం  కవాడిగూడ జేఏసీ కార్యాలయంలో ఆయ న మాట్లాడుతూ దేశంలో పౌరులకు ఎప్పుడైనా నష్టం, కష్టం, బాధలు,  అగౌరవాలు  కల్గినప్పుడు, నష్టాన్ని తీర్చుకునే, నష్ట పరిహారాలను  పొందేందుకు  రాజ్యంగం కల్పించిన వృవస్థలున్నాయని గుర్తు చేశారు.