12-06-2025 12:24:27 PM
ముగిసిన వేసవి ఉచిత శిక్షణా శిబిరం
ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి
గద్వాల (విజయక్రాంతి) : వివిధ అంశాల పట్ల అంతర్గత నైపుణ్యం ప్రతి ఒక్కరిలో ఉంటుందని, దాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి ఉచిత శిక్షణా శిబిరాలు దోహద పడుతాయని ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి అన్నారు. గురువారం గద్వాల పట్టణంలోని శ్రీ సరస్వతి ఉన్నత పాఠశాలలో ప్రిన్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి ఉచిత శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం కు ఆమె ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క చిన్నారి చదువుతో పాటు సృజనాత్మాకతను పెంపొందించుకోవాలని సూచించారు.
ఇలాంటి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం చిత్రలేఖ, చిత్రకళ పోటీలలో ప్రతిభ కనపరిచిన చిన్నారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ కురుమన్న, ఆలయం కమిటీ డైరెక్టర్ రాధామ్మ రెడ్డి, న్యాయవాది వరలక్ష్మి దేవి, ప్రిన్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గిరిబాబు, సరస్వతి విద్యా మందిరం కరస్పాండెంట్ బీచుపల్లి, సీనియర్ కళాకారుడు శ్రీనివాసులు, రాధిక, శోభిత, సభ్యులు శివకుమార్, ఆనంద్, నాయకులు జమ్మన్న, శివ, రమేష్, బద్రి, లక్ష్మన్న, చిన్న, మహేందర్, అరవింద్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.