calender_icon.png 18 June, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

18-06-2025 12:21:44 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 17 (విజయక్రాంతి); భద్రాద్రి కొత్తగూడెంను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశం జిల్లా ఎస్ పి రోహిత్ రాజు తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు,యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.

మాదకద్రవ్యాలు వినియోగం లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించకుండా ఉండేలా కళాశాల యజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలన్నారు. విద్యాసంస్థల్లో నిర్వహించే పేరెంట్స్ టీచర్ సమావేశాల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం వల్లే కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు. గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై యదార్థ సంఘటన ఆధారంగా వారి భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపడుతుందో వీడియోల ద్వారా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలు అలవాటు ఉన్న వారిని గుర్తించి వారిని పునరావాస కేంద్రాలు ద్వారా అలవాటు మానిపించాలన్నారు. మాదకద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాలోని ఆసుపత్రులు మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్కు సూచించారు.

మాదకద్రవ్యాలు వినియోగించినా, రవాణా చేసిన పిడి యాక్టర్ నమోదు చేస్తాం : ఎస్పీ రోహిత్ రాజు

 మాదకద్రవ్యాలు వినియోగించిన లేదా రవాణా చేసిన పీడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 3,500 కేజీల గంజాయిని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. జిల్లాకు ఒరిస్సా నుండి వయా సీలేరు ద్వారా అటవీ ప్రాంతం నుండి గంజాయి రవాణా నియంత్రించేందుకు భద్రాచలం చెక్ పోస్ట్ ద్వారా 24 గంటల పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి గంజాయి రవాణా ను అడ్డుకుంటున్నామన్నారు.

రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మాదకద్రవ్యాలు గుర్తించేందుకు రెండు నాక్కోటిక్ డాగ్ లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.  ఈ సమీక్ష సమావేశంలో భద్రాచలం ఏ.ఎస్.పి విక్రాంత్ సింగ్, ఎక్సైజ్ సూపర్ టెంట్ జానయ్య, ఇల్లందు డి ఎస్పీ రమణమూర్తి, కొత్తగూడెం ఆర్ టి ఓ వెంకటరమణ, జిల్లా వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్థాయి వసతులతో అభివృద్ధి: కలెక్టర్ జితేష్ వీ పాటిల్అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో 

కలెక్టర్ పాల్గొని చిన్నారులకు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 17 (విజయక్రాంతి)అంగన్వాడి కేంద్రాలను కార్పొరేట్ స్థాయి వ సతులతో అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ జి తేష్ పటేల్ అన్నారు. పాత పాల్వంచలోని మం డల ప్రాథమిక పాఠశాలల లోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొని అంగన్వాడీ విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, పం పిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దబడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ, త్రాగునీటి , మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. పిల్లలకు అవసరమైన ఆహారం, విద్య, ఆటపాటల వాతావరణం, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అన్నింటిని సమగ్రమైన విధంగా అందిస్తున్నారు అని అన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో అనుభవజ్ఞులైన టీచర్లను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, వారు చిన్నారుల మానసిక, భౌతిక అభివృద్ధికి తగిన తరగతులు నిర్వహిస్తున్నారని వివరించారు.తల్లిదండ్రులందరు చిన్నారులను ఖరీదైన ప్రైవేటు పాఠశాలలలో చేర్పించి ఆర్థిక భారాన్ని మోసుకోవడం అవసరం లేదని,అంగన్వాడీ కేంద్రాల్లోనే ఆధునిక వసతులతో కూడిన విద్యాబోధన అందుబాటులో ఉందన్నారు. ముందు అంగన్వాడీలలో చేర్పించి, తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలి. ఇవే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాస్, మహిళా శిశు, వయోవృత్తుల, దివ్యంగుల శాఖ అధికారి స్వర్ణలత లేని నా, ఐసిడిఎస్ పిడి ,సిడిపిఓ సూపర్వైజర్లు,అంగన్వాడీ టీచర్లు, పిల్లల,తల్లులు తదితరులు పాల్గొన్నారు.