calender_icon.png 18 June, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఎంసీ నోటీసులు సర్వ సాధారణం

18-06-2025 12:20:20 AM

  1. కొత్త మెడికల్ కళాశాలల్లో లోటుపాట్లు సహజం
  2. ప్రభుత్వ సహకారంతో ఒక్కో సమస్యను పరిష్కరిస్తాం..
  3. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రకుమార్

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): విద్యాసంవత్సర ఆరంభంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) ఉన్నతాధికారులు మెడికల్ కాలేజీలను తనిఖీ చేయడం, యాజమాన్యాలకు నోటీసులివ్వడం సర్వ సాధారణమైన విషయమని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో కొట్టిపడేశారు.

తెలంగాణలోని కాలేజీలకే కాక తాజాగా ఎన్‌ఎంసీ ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా అనేక రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. కొందరు పనిగట్టుకుని కేవలం తెలంగాణలో ని కాలేజీలకు మాత్రమే నోటీసులు వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని అభ్యంతరం వ్య క్తం చేశారు.

కొత్త కాలేజీలు ఏర్పాటు చేసినప్పుడు చిన్న సమస్యలు తలెత్తుతాయని, వాటన్నింటినీ యాజమాన్యాలు ప్రభుత్వ స హకారంతో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాయన్నారు.  త్వరలో అన్ని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతులు వస్తాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు.

నేడు ఢిల్లీకి వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ..

రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బయోమెట్రిక్స్ అటెండెన్స్, క్లినికల్ పారామీటర్స్, మౌలిక వసతుల కల్పన సహా అనేక అంశాల్లో యాజమాన్యాలు వైఫల్యం చెందాయంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్  (ఎన్‌ఎంసీ) ఈ నెల 13న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్కార్ తీసుకుంటున్న చర్యలపై వివరించేందుకు బుధవారం హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు డీఎంఈ ఢిల్లీకి వెళ్లనున్నారు.

అక్కడ ఎన్‌ఎంసీ ఉన్నతాధికారులకు ప్రభుత్వం తరఫున నివేదిక అందించనున్నారు. అలాగే వసతుల కల్పనలో విఫలమై న అన్ని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్  కూ డా ఢిల్లీ నుంచి ఎన్‌ఎంసీ నిర్వహించే వీడి యో కాన్ఫరెన్స్‌లో వివరణ ఇవ్వనున్నారు. సత్వరం కాలేజీల్లో వసతులు కల్పిస్తామని రాష్ట్రానికి చెందిన మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సమాధానమిస్తారని తెలిసింది.