18-06-2025 12:22:13 AM
కరీంనగర్, జూన్ 17 (విజయక్రాంతి): కరీంనగర్ జడ్పీ ఉద్యోగులు ఇద్దరు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ ఏఈఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ అద్దె కారు బిల్లు చెల్లించే విషయంలో లంచం కోసం కక్కుర్తి పడ్డారు. ప్రైవేటు క్యాబ్ యజమానికి ఆరు నెలలకోసారి వచ్చే అద్దె తాలుకు డబ్బుల్లోనూ చేయి చాపడంతో బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
దీంతో మంగళవారం రూ.8 వేలు లంచం తీసుకుంటున్న ఏఈఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ నేతృత్వంలో ఇద్దరిని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చనున్నారు.