calender_icon.png 30 June, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకగ్రీవమైతే బాగుండు!

30-06-2025 01:58:08 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై నా కోరిక అదే

అభివృద్ధి అంటే ఏమిటో మోదీని చూసి రేవంత్ నేర్చుకోవాలి

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఏక గ్రీవం అయితేనే బాగుంటుందని తాను భావిస్తున్నట్లు కేంద్రమంత్రి, బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి తెలిపా రు. ఆదివారం కళ్యాణ్‌నగర్‌లో ప్రధాని మోదీ మన్ కీ బాత్  కార్యక్రమం వీక్షించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.. పార్టీ రాష్ర్ట అధ్యక్ష పదవిపై మంగళవారం క్లారిటీ వస్తుందని అన్నారు. సోమవారం నామినేషన్ల కార్యక్రమం ఉంటుందని.. మంగళవా రం నూతన అధ్యక్ష పదవిపై ప్రకటన వస్తుందన్నారు.

రాష్ర్ట అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఎన్నికల పరిశీలకు లుగా వ్యవహరించనున్న సునీల్ బన్స ల్, శోభా కరంద్లాజే సోమవారం హైదరాబాద్ వస్తారని, వారి సమక్షంలోనే నామినేషన్ల స్వీకరణ ఉంటుందని వివరించారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

అభి వృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోదీ ని చూసి తెలుసుకోవాలంటూ రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము ఎప్పటికీ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి ఇందుకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. రాజకీయాల కో సం ఎలా పడితే అలా మాట్లాడటం తగదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్రమంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హామీ ఇచ్చినట్లుగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభించామని గుర్తుచేశారు.