18-06-2025 12:47:18 AM
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే దే అధిక రాబడి కోసం. పెట్టుబడులకు తిరిగి చక్కని లాభాలు వస్తే ఆ ప్రాంతానికి ఎక్కడ లేని క్రేజ్ వస్తుంది. మన భాగ్యనగరం రియ ల్ రిటర్న్స్లో దేశంలోనే అత్యుత్తమ నగరం గా పేరొందింది. నగరంలో రియల్ ఎస్టేట్ రంగంపై పెట్టే పెట్టుబడులకు 80శాతం మేర రిటర్న్స్ వస్తున్నాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాం కర్ సార్థక్ అహూజా సర్వేలో వెల్లడైంది.
ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడించారు.. నగరంలో భూములు, విల్లాలపై పెట్టిన పెట్టుబడులకు 80శాతం రిటర్న్స్ రావడం గొప్ప విషయమని కొనియాడారు. రియల్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ స్థానంలో ఉందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. రియల్ ఎస్టేట్లో మన రాజధానిది నంబర్వన్ స్థానం కావడం విశేషం. హైదరాబాద్ తర్వాత ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్న నగరాలైన నోయిడా, గు ర్గావ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
2020 నుంచి ఇప్పటివరకు టాప్ మెట్రో నగరాల్లోని రియల్ ఎస్టేట్ రంగాన్ని పరిశీలిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారిందని, 80శాతం రాబడిని తెచ్చిపెట్టిందని ఈ నివేదిక తెలిపింది. ఇంతటి భారీ వృద్ధి సాధించడంలో మిగతా నగరాలు చాలా వెనుకబడ్డాయని అహూజా పేర్కొన్నారు. హైదరాబాద్లో 80శాతం పెట్టుబడులకు రిటర్న్స్ అనేది ఎంతో కీలకమైన అంశంగా రియల్ నిపుణులు అంటున్నారు. ఇది భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడికే...
సాధారణంగా పెట్టుబడిదారులు ఎక్కడైతే నిలకడగా అభివృద్ధి ఉంటుందో అక్కడే తమ పెట్టుబడులు పెడతారు. ఇండస్ట్రీ ఫ్రెం డ్లీ పాలసీలు, మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు.. ఇలా అన్ని అంశాలను పెట్టుబడిదారులు పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే హైదరాబాద్ పెట్టుబడిదా రులకు స్వర్గధామంగా మారిందని స్పష్టంగా తెలుస్తోంది.
మిగతా నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయినా..మన వద్ద మా త్రం ఊహించని విధంగా పురోగతిలో ఉండటంతో రియల్ ఎస్టేట్ సంస్థలు, పెట్టుబడి దారులు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందు కు ముందుకు వస్తున్నట్లు అహుజా నివేదికలో వెల్లడైంది. హైదరాబాద్ వేగంగా అభి వృద్ధి చెందుతుండటంతో ప్రపంచస్థాయి సంస్థలు ఇక్కడ కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయి.
ఫార్మా, ఐటీ, పారిశ్రామిక, లైఫ్ సై న్సెస్ రంగాల అభివృద్ధికి ఎన్నో అవకాశాలుండటంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యా పారం క్రమంగా పెరుగుతోంది. నైట్ ఫ్రాంక్- 2024 నివేదిక ప్రకారం..హైదరాబాద్లో సగటు వార్షిక వృద్ధి 6 నుంచి 14 శాతం వరకు ఉన్నట్టు వెల్లడైంది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఎక్కువ రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ డిమాండ్ ప్రకారం హైదరాబాద్ త ర్వాత నోయిడా, గుర్గావ్, బెంగళూరు, ముం బైవంటి నగరాల్లో కొత్త ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతుండగా.. చెన్ను, కోల్కతా వంటి నగరాలు మాత్రం కొంత వెనుకబడినట్లు నివేది కలు వెల్లడిస్తున్నాయి.
ఎన్సీఆర్ పరిధిలో ఉండటం, ఎక్స్ప్రెస్ వే వల్ల గుర్గావ్ బూమ్..
ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్న గుర్గావ్ (హర్యానా) సిటీ అత్యంత వే గంగా అభివృద్ధి చెందుతోంది. దేశ రాజధానికి ఆనుకుని ఉండటం గుర్గావ్ అభివృ ద్ధికి ఓ కారణం కాగా..అక్కడ కేంద్ర ప్రభు త్వం చేపట్టిన ద్వారకా ఎక్స్ప్రెస్ వే, గోల్ఫ్ కోర్స్ రోడ్ తదితర కారిడార్ కూడా బాగా కలిసివచ్చాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగంలో గుర్గావ్ రేంజ్లో ముందుకుసాగుతోంది.
గతేడాదితో పోలిస్తే గుర్గావ్ రియాలిటీ వృద్ధి రేటు గణనీయంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఎన్సీఆర్ పరిధిలోనే ఉన్న నోయిడా (ఉత్తరప్రదేశ్) కూడా రియల్ఎస్టేట్ వృద్ధి చెందుతున్నది. అక్కడ కొత్తగా ప్రాజెక్టుల లాంఛ్ సగటు ధర 201- 24 వరకు 152శాతం పెరిగింది. అదే సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో మహానగరాలుగా పేరొందిన చెన్ను, కోల్కతా చాలా వెనకబడిపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
కోల్కతాలో వివిధ ప రిస్థితుల నేపథ్యంలో అభివృద్ధి మందగిస్తు న్నా..చెన్నై వెనకబాటు రియల్ రంగ నిపుణులను నివ్వెరపరుస్తోంది. అయితే బెంగ ళూరు, ముంబై స్థిరంగా ముందుకు సాగుతుండటం కాస్త ఉపశమనంగా రియల్ నిపుణులు చెబుతున్నారు.