17-06-2025 12:00:00 AM
ఎంసీఎక్స్లో లక్ష దాటిన బంగారం ధర
ముంబై, జూన్ 16: బంగారం ధరలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. సోమవారం మల్టీ కమోడిటీ ఎక్చేంజ్ (ఎంసీఎక్స్) ఆగస్ట్ ఫ్యూచర్స్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,01,078కి చేరుకుంది. ఈ విధంగా ధరలు పెరగడంతో మధ్యతరగతి వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
వెండి ధర కూడా కేజీ 1,06,464 రూపాయలకు చేరుకుంది. ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి, ముడిచమురు ధరలు పెరగడం వంటి కారణాలు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3450 డాలర్లు దాటింది.