24 March, 2026 | 4:07 AM

హైడ్రాకు చురకలు

24-03-2026 12:52 AM

బతుకమ్మ కుంట సమీపంలోని డిస్ప్యూట్ ల్యాండ్‌లో ఏర్పాటు చేసిన ప్రహరీ, బోర్డులు తొలగించాలి

ఆదేశించిన హైకోర్టు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 23 (విజయక్రాంతి): హైడ్రాకు తెలంగాణ హైకోర్టు చురకలంటించింది. బాగ్ అంబర్‌పేటలోని బతుకమ్మకుంట చెరువు సమీపంలో ఉన్న డిస్ప్యూట్ ల్యాండ్‌లో హైడ్రా ఏర్పాటు చేసిన ప్రహరీ, బోర్డులు తొలగించాలంటూ ఆదేశించింది. బతుకమ్మకుంట చెరువు భూములకు సంబంధించి ఎడ్ల సుధాకర్ రెడ్డి, హైడ్రా మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

అయితే 2025 కోర్టు తీర్పు ప్రకారం ఈ స్థలంపై యథాతథ స్థితిని పాటించాలని ఇచ్చిన కోర్టు ఆదేశాలు పాటించాలని ఆదేశించింది. ఈ పనులన్నింటినీ నాలుగు వారాల వ్యవధిలో పూర్తి చేయాలని హైడ్రాకు గడువు విధించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా వీటిని తొలగించని పక్షంలో తదుపరి చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించింది.