ప్రాణం తీసిన 100 రూపాయలు!
24-03-2026 12:56 AM
మహబూబాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూర్య తండాకు చెందిన తేజవత్ కాంతి (55).. అజ్మీర బాన్కీ, నీలతో పక్క గ్రామంలో మిరప తోట ఏరడానికి కూలి పనికి వెళ్లింది. కూలి డబ్బులో వంద రూపాయలు తనకు రావాల్సి ఉందంటూ బానికి, నీలతో ఆదివారం సాయంత్రం గొడవపడ్డారు.
సోమవారం తెల్లవారుజామున ఇద్దరు మహిళల కుటుంబీకులు కాంతి ఇంటికి వచ్చి ఆమెపై దాడికి పాల్పడ్డారు. అవమానాన్ని తట్టుకోలేక కాంతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, బంధువులు మృతదేహాన్ని దాడికి పాల్పడిన వారి ఇంటి ముందు ఉంచి ధర్నాకు దిగారు. కాగా మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.




