calender_icon.png 31 May, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంధ్ర మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకో..?

30-05-2025 02:28:50 PM

గోబెల్స్ కూడా సిగ్గుపడేలా అబద్ధాలు.           

తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన జగదీశ్ రెడ్డి.         

సూర్యాపేట,(విజయక్రాంతి): ఆంధ్ర మహానాడులో తెలంగాణ ముచ్చట ఎందుకని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu)ను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Suryapet MLA Guntakandla Jagadish Reddy) ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విదేశీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఘాటుగా స్పందించారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా అబద్దాలు చెబుతున్నారన్నారు. 2004 తోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిందన్నారు.

2004 లో సమైక్య ఆంధ్రప్రదేశ్(United Andhra Pradesh) తలసరి ఆదాయం 26 వేల లోపేనన్నారు. 2014 నుంచి ఆంధ్రలో మీ ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి గుర్తుచేసుకోవాలంటూ చురకలంటించారు. కేసీఆర్ (Kalvakuntla Chandrashekar Rao) పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. 2014లో ప్రత్యేక రాష్టంగా ఏర్పడ్డ నాడు తెలంగాణాలో 1.12 లక్షల తలసరి  ఆదాయముంటే.. కేసీఆర్ పాలనలో అది 3.70 లక్షలకు చేరిందన్నారు. నేటికీ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) తలసరి ఆదాయ 2.50 లక్షలు మాత్రమే అనే విషయాన్ని గుర్తెరిగి మాట్లాడాలన్నారు. నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే ఏపీ ఆదాయం ఎందుకు పెరుగుతలేదు చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమలేకనా.. ఎనాటికైనా హైదరాబాద్ కు రావాల్సిందే కాబట్టి ఆంధ్రను వాడుకుని వదిలేద్దామనుకుంటున్నావా అనే విషయాలను చంద్రబాబు స్పష్టం చేయాలన్నారు.