calender_icon.png 19 December, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి తుమ్మలను కలిసిన జగన్నాధపురం సర్పంచ్

19-12-2025 05:21:48 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీల ఎన్నికల్లో జగన్నాధపురం సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కుంజా వినోద్  ఎన్నికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్నాధపురం సర్పంచిగా ఎన్నికైన కుంజా వినోద్ ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు అడపా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.