15 April, 2026 | 1:51 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్

06-04-2025 12:18 AM

తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్

ముషీరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి):  స్వాతంత్య్ర సమరయోధులు సామాజిక న్యాయానికై పరితపించిన గొప్ప నేత బాబు జగ్జీవన్ రామ్ అని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ రాష్ట్ర కన్వీనర్ ఐల వెంకన్న గౌడ్ అన్నారు.

ఈ మేరకు శనివారం బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా  గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్, గౌడ సంఘాల సమన్వయకర్త ముద్ద గోని రామ్మోహన్ గౌడ్ తో కలిసి జగ్జీవన్ రామ్ గ్రహానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి , విశిష్టమైన పార్లమెంటేరియన్, ప్రజాస్వామ్యవాది, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన సమర్థ పరిపాలనాదక్షుడు అని కొనియాడారు.

భారతీయ రాజకీయాల్లో అర్ధ శతాబ్దానికి పైగా నిబద్ధత, అంకితభావంతో సేవలందించిన మహోన్నత నేతగా వారు అభివర్ణించారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని  పిలుపునిచ్చారు.